-Advertisement-

Important Questions on Rythu Bandhu scheme Telangana

telangana rythu bandhu status rythu bandhu telangana ts rythu bandhu status rythu bandhu scheme rythu bandhu beneficiary status rythu bandhu 2022 ryth
SCHOOLS VISION

Important Questions on Rythu Bandhu scheme Telangana

Q1: రైతుబంధు లబ్ధిదారుల్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?

➊ నిజామాబాద్
➋ కరీంనగర్
➌ నల్గొండ
➍ మేడ్చల్ మల్కాజ్గిరి

Correct answer: నల్గొండ
రైతుబంధు పంపిణీలో అంటే రైతులు లబ్ధి పొందిన జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా నల్గొండ అయితే ఈ నల్గొండ జిల్లాకు రైతుబంధు సాయం 601.74 కోట్లు. లబ్ధి పొందిన రైతుల సంఖ్య 4 లక్షల 69 వేల మంది.

Q2: తెలంగాణలో రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

➊ 2014
➋ 2015
➌ 2018
➍ 2019

Correct answer: 2018
తెలంగాణలో రైతుబంధు పథకాన్ని 2018 మే 10వ తేదీన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రారంభించారు.


Rythu Bandhu details Telangana

Q3: రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఏ జిల్లాలో ప్రారంభించారు?

➊ కరీంనగర్
➋ నల్గొండ
➌ రంగారెడ్డి
➍ మెదక్

Correct answer: కరీంనగర్
రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలము ,శాలపల్లి ఇందిరా నగర్ లో ప్రారంభించారు.

Q4: ఒక సంవత్సరానికి ₹10,000 పెట్టుబడి సాయం ఏ ఆర్థిక సంవత్సరం నుండి ఇస్తున్నారు?

➊ 2017-18
➋ 2018-19
➌ 2019-20
➍ 2020-21

Correct answer: 2019-20
పథకం ప్రారంభంలో అంటే 2018లో సీజన్కు 4000 రూపాయలు ఉండేవి మొత్తం సంవత్సరానికి వానాకాలం 4000 రూపాయలు యాసంగిలో 4000 రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుండేవారు.

Q5: రైతుబంధు తరహాలో "కాళియా" అనే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

➊ పశ్చిమబెంగాల్
➋ ఝార్ఖండ్
➌ ఆంధ్ర ప్రదేశ్
➍ ఒడిశా

Correct answer: ఒడిశా
ఈ పథకంలో రైతు కుటుంబానికి 10000 రూపాయలు సంవత్సరానికి గాను, భూమిలేని వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిర్వహించే కుటుంబానికి సంవత్సరానికి 12,500 ఇస్తారు.

Q6: అతి తక్కువ రైతుబంధు సాయం పొందే జిల్లా ఏది?

➊ మేడ్చల్ మల్కాజ్గిరి
➋ ఆదిలాబాద్
➌ నిర్మల్
➍ రంగారెడ్డి జిల్లా

Correct answer: మేడ్చల్ మల్కాజ్గిరి
రైతుబంధు పంపిణీలో అతి తక్కువ లబ్ధి పొందే జిల్లా ఏదంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పెట్టుబడి సాయం 33 కోట్ల 65 లక్షలను 33352 మంది రైతులు పొందుతున్నారు.

Q7: రైతుబంధు తరహాలో కృషక్ బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?

➊ ఆంధ్రప్రదేశ్
➋ పశ్చిమబెంగాల్
➌ ఝార్ఖండ్
➍ ఒడిశా

Correct answer: పశ్చిమబెంగాల్
రైతుబంధు తరహాలో కృషక్ బంధు అనే పథకాన్ని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పెట్టుబడి సాయం సంవత్సరానికి గాను 5000 రూపాయలు.

Q8: "ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద యోజన" అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

➊ తమిళనాడు
➋ పశ్చిమబెంగాల్
➌ ఒడిశా
➍ ఝార్ఖండ్

Correct answer: ఝార్ఖండ్
ఝార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద యోజన అనే పెట్టుబడి సాయం పథకాన్ని రైతుబంధు తరహాలో ప్రవేశపెట్టింది.

Q9: 2022-23 బడ్జెట్లో రైతుబంధుకు కేటాయించిన రూపాయలు ఎన్ని?

➊ 10,000 కోట్లు
➋ 14,000 కోట్లు
➌ 14,,500 కోట్లు
➍ 14,800 కోట్లు

Correct answer: 14,800 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి 2022-23 బడ్జెట్లో 14,800 కోట్లను కేటాయించారు.

Q10: రైతు బంధు పథకంలో అర్హత గల భూ గరిష్ట పరిమితి ఎంత?

➊ మూడెకరాలు
➋ ఐదు ఎకరాలు
➌ పది ఎకరాలు
➍ మేడ్చల్ మల్కాజ్గిరి

Correct answer: భూమికి గరిష్ట పరిమితి లేదు
తెలంగాణ రైతు బంధు పథకంలో ఎన్ని ఎకరాల భూమికి అనేది లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు వర్తిస్తుంది.

Q11: రైతు బంధు పథకం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ రైతు భరోసా ను ఎప్పుడు ప్రారంభించింది?

➊ 2018-19
➋ 2019-20
➌ 2020-21
➍ పైవేవీ కాదు.

Correct answer: 2019-20
తెలంగాణలో గల రైతుబంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా అనే పథకాన్ని 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది.

Q12: 2023 జనవరి వరకు ఎన్ని సీజన్లకు రైతుబంధు సాయాన్ని అందించారు?

➊ 8 సీజన్లు
➋ 10 సీజన్లు
➌ 11 సీజన్లు
➍ 12 సీజన్లు

Correct answer: 10 సీజన్లు
2023 జనవరి వరకు రైతుబంధు సాయాన్ని 10 సీజన్లకు అందించారు.

Q13: ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ రైతు భరోసా ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం ఎంత?

➊ 7500 రూపాయలు
➋ 10000 రూపాయలు
➌ 5000 రూపాయలు
➍ 12 వేల రూపాయలు

Correct answer: 7500 రూపాయలు
ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక సంవత్సరానికి గాన్ని పెట్టుబడి సాయం 7500 రూపాయలు.

Q14: రైతు బంధు పథకం ఎటువంటి భూములకు వర్తిస్తుంది?

➊ వ్యవసాయ భూములకు
➋ వ్యవసాయతర భూములకు
➌ పై రెండింటికి
➍ పైవేవీ కావు

Correct answer: పై రెండింటికి
ఈ రైతు బంధు పథకం అనేది వ్యవసాయ మరియు వ్యవసాయతర భూములకు కూడా వర్తిస్తుంది.

Q15: రైతు బంధు పథకం ద్వారా ఎంతమంది లబ్ది పొందారు?

➊ 40 లక్షల మంది
➋ 60 లక్షల మంది
➌ 63 లక్షల మంది
➍ 80 లక్షల మంది

Correct answer: 63 లక్షల మంది
తెలంగాణలో రైతుబంధు పథకం ద్వారా దాదాపు 63 లక్షల మంది లబ్ధి పొందారు.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-