-Advertisement-

CLASS 5 EVS BIT BANK | FORESTS - TRIBALS | PART 2

SCHOOLS VISION

 

FOESTS AND TRIBALS QUESTION AND ANSWERS

Q1: అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఏది?

➊ గోండులు
➋ బోండాలు
➌ చెంచులు
➍ ముండాలు

Correct answer: చెంచులు
చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు వీరు ఏ రోజుకి ఆరోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు.

Q2: భారతదేశంలో బోండా తెగ జనాభా ఎంత?

➊ దాదాపు 11,000
➋ దాదాపు 12,000
➌ దాదాపు 20,000
➍ దాదాపు లక్ష

Correct answer: దాదాపు 12,000
ఈ జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు కొండలలో మరియు దట్టమైన అడవుల్లోనూ ఇంకా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కానగిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లోనూ ఉంటారు వీరిని బోండోపోరోజూ అని కూడా అంటారు.

Q3: గోడల మీద మొక్కల నుండి సేకరించిన రంగులతో బొమ్మలు వేసే గిరిజన తెగ ఏది?

➊ బోండా జాతిప్రజలు
➋ సంతాలులు
➌ చెంచులు
➍ గోండులు

Correct answer: గోండులు
ఈ జాతి గిరిజనులలో మహిళలు నేలమీద గోడల మీద ప్రత్యేకమైన పద్ధతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు ముఖ్యంగా పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Q4: ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా నివసిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది?

➊ బోండా జాతి గిరిజనులు
➋ ముండాలు
➌ చెంచులు
➍ గోండులు

Correct answer: బోండా జాతి గిరిజనులు
ఈ తెగవారు దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు వీరు నాగరిక ప్రజలతో కలవడానికి ఇష్టపడరు అందుకే ఎప్పుడో గాని అడవి దాటి బయటికి రారు.

Q5: లింగయ్య స్వామి పూజ, చెంచులక్ష్మి పూజ ఏ గిరిజనులకు ప్రత్యేకమైనవి?

➊ బోండా జాతి గిరిజనులు
➋ ముండాలు
➌ చెంచులు
➍ గోండులు

Correct answer: చెంచులు
లింగయ్య స్వామి పూజ మరియు చెంచులక్ష్మి పూజ చెంచులకు చాలా ముఖ్యమైనవి ఈ పూజలు మాఘమాసంలో నిర్వహిస్తారు ఈ పూజలలో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.

Q6: కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నించే గిరిజన తెగ ఏది?

➊ బోండా జాతి గిరిజనులు
➋ ముండాలు
➌ చెంచులు
➍ గోండులు

Correct answer: బోండా జాతి గిరిజనులు
బోండా జాతి గిరిజనులు వారి ప్రాంతాలలోకి కొత్తవారిని రానివ్వరు ఒకవేళ వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు.

Q7: జనపనారతో తయారుచేసిన దుస్తులు కట్టుకునే గిరిజన తెగ ఏది?

➊ గోండులు
➋ బోండాలు
➌ చెంచులు
➍ ముండాలు

Correct answer: బోండాలు
బోండాలలో స్త్రీలు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు జనపనాలను దగ్గరలో ఉన్న వాగులు వంకలలో రెండు మూడు రోజులపాటు నానబెట్టి దారాలు తీసి మూడు రోజులపాటు ఎండలో ఆరబెట్టి మగ్గంలో నేస్తారు వీటికి చిన్నచిన్న అద్దాలను కుడతారు.

Q8: తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసిస్తున్న గిరిజన తెగ ఏది?

➊ గోండులు
➋ బోండాలు
➌ చెంచులు
➍ ముండాలు

Correct answer: చెంచులు
చెంచులు తెలంగాణలో నల్లమల్ల అడవుల్లో నివసిస్తారు మరియు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటారు చెంచు భాష అచ్చం తెలుగు భాష వలె ఉంటుంది.

Q9: కుందేళ్లు ,పిచ్చుకలు వంటి చిన్న జంతువులని ఎప్పుడూ వేటాడని గిరిజన తెగ ఏది?

➊ గోండులు
➋ చెంచులు
➌ బోడోలు
➍ బోండాలు

Correct answer: చెంచులు
చెంచులు విల్లు బాణాలు మరియు చిన్న కత్తులు ఉపయోగించి జింకలను అడవిపందులను వేటాడుతారు కానీ కుందేలు పిచ్చుకలు వంటి చిన్న చిన్న జంతువులను వీరు ఎప్పుడు వేటాడరు మరియు వేటాడగా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు.

Q10: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో ఏ ఏ గిరిజనులు ఉన్నారు?

➊ కోయలు మరియు కొండరెడ్లు
➋ బంజారా లు
➌ గోండులు
➍ ముండాలు

Correct answer: కోయలు మరియు కొండరెడ్లు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలోని అడవుల్లో కోయ తెగతోపాటు కొండ రెడ్లు కూడా ఉన్నారు.

Q11: బంజారా తెగకు చెందిన గిరిజనులు ఏ జిల్లాలో ఉన్నారు?

➊ మహబూబ్నగర్
➋ నిజామాబాద్
➌ హైదరాబాద్
➍ మహబూబాబాద్

Correct answer: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు చాలామంది ఉన్నారు.

Q12: తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది?

➊ జయశంకర్ జిల్లా
➋ భద్రాద్రి జిల్లా
➌ ఆదిలాబాద్ జిల్లా
➍ నిజామాబాద్ జిల్లా

Correct answer: జయశంకర్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు అనగా 16.8 9% గా ఉన్నాయి.

Q13: భారతదేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

➊ చత్తిస్గడ్
➋ మధ్యప్రదేశ్
➌ హర్యానా
➍ ఒరిస్సా

Correct answer: గోండులు
మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అడవి విస్తీర్ణం ఉంది.

Q14: మన భారతదేశం మొత్తం భూభాగంలో అడవుల యొక్క శాతం ఎంత?

➊ 30%
➋ 34 %
➌ 27%
➍ 21.05%

Correct answer: 21.05 %
మన దేశం మొత్తం భూభాగంలో అడవులు ఆరు లక్షల 92,027 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి

Q15: గ్లోబల్ వార్మింగ్ (భూగోళం వేడెక్కడం) ఏ వాయువు కారణంగా జరుగుతుంది?

➊ నైట్రోజన్
➋ హీలియం
➌ కార్బన్ డయాక్సైడ్
➍ హైడ్రోజన్

Correct answer: కార్బన్ డయాక్సైడ్
చెట్లను నరికి వేయడం వల్ల వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది అందువలన భూమి వేడెక్కుతుంది దీనిని గ్లోబల్ వార్మింగ్ లేదా భూగోళం వేడెక్కడం అంటారు దీని వల్ల వర్షాలు తగ్గుతాయి.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-